ముగిసిన కవిత సీబీఐ విచారణ..
- December 11, 2022
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (CBI) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
సీఆర్పీసీ 161 కింద కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే సీబీఐ విచారణ గురించి కవిత న్యాయ నిపుణులతో చర్చించారు. నేటి విచారణలో భాగంగా అరోరాతో లింకేంటి?, ఆ రూ.100 కోట్లు ఎక్కడివి? అనే ప్రశ్నలు కవితను సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈడీ రిమాండు రిపోర్టులో ఆమె పేరును పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్రతో పాటు కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ చెప్పింది. కాగా, కవితను చూసేందుకు ఆమె ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు వస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







