ముగిసిన కవిత సీబీఐ విచారణ..
- December 11, 2022
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు బృందం (CBI) అధికారులు ఇవాళ ఏడున్నర గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో సాక్షిగా ఆమె నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. సీబీఐ అధికారులు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
సీఆర్పీసీ 161 కింద కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందే సీబీఐ విచారణ గురించి కవిత న్యాయ నిపుణులతో చర్చించారు. నేటి విచారణలో భాగంగా అరోరాతో లింకేంటి?, ఆ రూ.100 కోట్లు ఎక్కడివి? అనే ప్రశ్నలు కవితను సీబీఐ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉన్నట్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈడీ రిమాండు రిపోర్టులో ఆమె పేరును పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్లుగా శరత్ చంద్రతో పాటు కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని ఈడీ చెప్పింది. కాగా, కవితను చూసేందుకు ఆమె ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు వస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









