సెప్టెంబరు వరకు 168% పెరిగిన విమానాశ్రయాల రాకపోకలు: NCSI
- December 12, 2022
మస్కట్: 2021లో ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు ఒమన్లోని విమానాశ్రయాలకు వచ్చేవారి సంఖ్య 168 శాతం పెరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) డేటా ప్రకారం.. అదే సమయంలో బయలుదేరే ప్రయాణికుల సంఖ్య 120 శాతం పెరిగింది. 2022 మొదటి తొమ్మిది నెలల్లో ఒమన్ విమానాశ్రయాలలో మొత్తం రాకపోకలు, బయలుదేరినవారు, రవాణా ప్రయాణీకుల సంఖ్య 6,969,976. మొత్తం 55,814 అంతర్జాతీయ విమానాలు ఒమన్ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాయి. 2021లో ఈ సంఖ్య 26, 636గా ఉన్నది.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాల సంఖ్యలో 113.6 శాతం పెరుగుదలను సాధించింది. సలాలా విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 221.2 శాతం పెరిగింది. అయితే దాని నుండి దేశీయ విమానాలు 39 శాతం పెరిగి 3,857 విమానాలకు చేరుకున్నాయి. 2021లో ఈ సంఖ్య 2,774 గా ఉన్నాయి. సోహార్ విమానాశ్రయంలో 2022లో సెప్టెంబర్ చివరి వరకు 55,243 మంది ప్రయాణికులతో 585 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించాయి. దుఖ్మ్ (Duqm ) విమానాశ్రయం నుంచి ప్రయాణించిన దేశీయ విమానాల సంఖ్య సెప్టెంబర్ 2022 చివరి నాటికి 490కి చేరగా 4.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2021లో సెప్టెంబర్ వరకు ఇది 468గా ఉంది.
మస్కట్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే జాతీయులలో భారతీయులు (113,785 మంది ప్రయాణీకులు) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జాతీయులు (52,644), పాకిస్థానీలు (34,078) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







