సెప్టెంబరు వరకు 168% పెరిగిన విమానాశ్రయాల రాకపోకలు: NCSI
- December 12, 2022
మస్కట్: 2021లో ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు ఒమన్లోని విమానాశ్రయాలకు వచ్చేవారి సంఖ్య 168 శాతం పెరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) డేటా ప్రకారం.. అదే సమయంలో బయలుదేరే ప్రయాణికుల సంఖ్య 120 శాతం పెరిగింది. 2022 మొదటి తొమ్మిది నెలల్లో ఒమన్ విమానాశ్రయాలలో మొత్తం రాకపోకలు, బయలుదేరినవారు, రవాణా ప్రయాణీకుల సంఖ్య 6,969,976. మొత్తం 55,814 అంతర్జాతీయ విమానాలు ఒమన్ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాయి. 2021లో ఈ సంఖ్య 26, 636గా ఉన్నది.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాల సంఖ్యలో 113.6 శాతం పెరుగుదలను సాధించింది. సలాలా విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 221.2 శాతం పెరిగింది. అయితే దాని నుండి దేశీయ విమానాలు 39 శాతం పెరిగి 3,857 విమానాలకు చేరుకున్నాయి. 2021లో ఈ సంఖ్య 2,774 గా ఉన్నాయి. సోహార్ విమానాశ్రయంలో 2022లో సెప్టెంబర్ చివరి వరకు 55,243 మంది ప్రయాణికులతో 585 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించాయి. దుఖ్మ్ (Duqm ) విమానాశ్రయం నుంచి ప్రయాణించిన దేశీయ విమానాల సంఖ్య సెప్టెంబర్ 2022 చివరి నాటికి 490కి చేరగా 4.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2021లో సెప్టెంబర్ వరకు ఇది 468గా ఉంది.
మస్కట్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే జాతీయులలో భారతీయులు (113,785 మంది ప్రయాణీకులు) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జాతీయులు (52,644), పాకిస్థానీలు (34,078) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









