గత రెండేళ్ల కంటే బలంగా ఫ్లూ వ్యాపి.. మరణాలు పెరగొచ్చు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

- December 12, 2022 , by Maagulf
గత రెండేళ్ల కంటే బలంగా ఫ్లూ వ్యాపి.. మరణాలు పెరగొచ్చు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

రియాద్: దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇన్‌ఫ్లూయెంజా కేసుల పెరుగుదలను గమనించినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ముహమ్మద్ అల్-అబ్దెల్ అలీ తెలిపారు. గత రెండేళ్లలో నమోదైన కేసుల కంటే ప్రస్తుతం దీని వ్యాప్తి బలంగా ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చాలా మంది చేరారని, ఫ్లూ మరణాలకు దారితీయవచ్చని ఆయన అన్నారు. తీవ్రమైన లక్షణాలతో బాధపడే వారిలో 80 శాతం మందికి సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని డాక్టర్ అబ్దెల్ అలీ తెలిపారు.

వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు, రోగనిరోధక శక్తి లోపం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, ఆరోగ్య రంగ కార్మికులు, ప్రజలతో పాటు సమాజంలోని అత్యంత బలహీనమైన విభాగాల వారు జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లను తీసుకోవాలని సూచించారు. టీకా సురక్షితమైనదని, ఎటువంటి దుష్ప్రభావాలు లేవని, ప్రపంచంలోని అన్ని దేశాలలో ఇది చాలా సంవత్సరాలుగా విజయవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కాలానుగుణ ఇన్‌ఫ్లూయెంజా అనేక సమస్యలను కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిలో అత్యంత తీవ్రమైనవి న్యుమోనియా, బ్రోన్కైటిస్, చెవి ఇన్ఫెక్షన్, బ్లడ్ పాయిజనింగ్ అని వీటి కారణంగాకొన్ని సందర్భాల్లో మరణం సంభవించవచ్చని తెలిపింది.

కాలానుగుణ ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలలో వణుకు, చెమటలు, 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, నిరంతర దగ్గు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇన్‌ఫ్లూయెంజా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలను అవాయిడ్ చేయడం, చేతులు సరిగ్గా కడుక్కోవడం, నేరుగా కళ్లు, నోటితో సంబంధాన్ని నివారించడం, తుమ్మినప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు టిష్యూలను ఉపయోగించడం,  స్థలం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం వంటి వాటిని పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com