గవర్నర్ తొలగింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- December 13, 2022
తిరువనంతపురం: కేరళ గవర్నర్కు పినరయి ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదం మరింత హీటెక్కింది. విశ్వవిద్యాలయాల కులపతి (ఛాన్స్లర్) పదవి నుంచి గవర్నర్ను తొలగించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు కదిలింది.ఈ విషయమై ఏకంగా బిల్లు రూపొందించిన ప్రభుత్వం, నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకుంది. ‘యూనివర్సిటీ చట్టాలు (సవరణ) బిల్లు 2022’ అనే బిల్లు మంగళవారం కేరళ అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం కేరళ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో గవర్నర్ను ఛాన్స్లర్గా కొనసాగించకూడదు. ఆ పదవుల్లో రాష్ట్ర ప్రభుత్వమే వేరే ఎవరినైనా నియమిస్తుంది.
అయితే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా మరొక వ్యక్తి నూతన ఛాన్స్లర్ నియామకం చేపట్టాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ పై OpenAI సీఈవో సామ్ అల్ట్మన్ ప్రశంసలు
- డేటా సెంటర్లతో భారీ ఉపాధి: ప్రధాని మోదీ
- దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- ‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- ఒమన్లో వరుస నేరాలు..పలువురు అరెస్టు..!!
- సౌదీ అరేబియాలో స్కూల్స్ టైమింగ్స్ ఛేంజ్..!!
- యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి









