గవర్నర్ తొలగింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
- December 13, 2022
తిరువనంతపురం: కేరళ గవర్నర్కు పినరయి ప్రభుత్వానికి మధ్య చెలరేగిన వివాదం మరింత హీటెక్కింది. విశ్వవిద్యాలయాల కులపతి (ఛాన్స్లర్) పదవి నుంచి గవర్నర్ను తొలగించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు కదిలింది.ఈ విషయమై ఏకంగా బిల్లు రూపొందించిన ప్రభుత్వం, నేడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకుంది. ‘యూనివర్సిటీ చట్టాలు (సవరణ) బిల్లు 2022’ అనే బిల్లు మంగళవారం కేరళ అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం కేరళ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో గవర్నర్ను ఛాన్స్లర్గా కొనసాగించకూడదు. ఆ పదవుల్లో రాష్ట్ర ప్రభుత్వమే వేరే ఎవరినైనా నియమిస్తుంది.
అయితే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. విద్యాధికులను కాకుండా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మాజీ హైకోర్టు జడ్జీని కానీ ఛాన్స్లర్ పదవిలో నియమించాలని డిమాండ్ చేసింది. డిసెంబర్ 7న కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సహా మరొక వ్యక్తి నూతన ఛాన్స్లర్ నియామకం చేపట్టాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..







