షాపులలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

- December 15, 2022 , by Maagulf
షాపులలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

యూఏఈ: ఎమిరేట్‌లోని షాపుల్లోకి చొరబడి ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదుతో పాటు ఇతర వస్తువులను దోచుకున్న ఐదుగురు ఆసియన్లతో కూడిన ముఠాను షార్జా పోలీసులు అరెస్టు చేశారు. తమ విచారణలో ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సీఐడీ డిప్యూటీ డైరెక్టర్‌ కల్నల్‌ ఫైసల్‌ బిన్‌ నాసర్‌ తెలిపారు. వారి నివాసం నుంచి చోరీకి గురైన వస్తువులు మొబైల్ ఫోన్లు, డబ్బు, వాచీలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేస్తామని ఆయన చెప్పారు. అధిక నాణ్యత గల సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, దుకాణంలో పెద్ద మొత్తంలో డబ్బును ఉంచకుండా.. విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశాలలో ఉంచడం ద్వారా తమ దుకాణాల్లో చోరీ నివారణ చర్యలను మెరుగుపరుచుకోవాలని వ్యాపార యజమానులను ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com