ఖురియాత్లో 200 కిలోల ఫిషింగ్ వలల తొలగింపు
- December 15, 2022
మస్కట్ : బ్లూ వాటర్ కంపెనీ, ఫిషరీస్ డెవలప్మెంట్ ఒమన్ సహకారంతో ఖురియాత్ డైవర్స్ ఖురియాత్లో కోరల్ రీఫ్స్ క్లీన్-అప్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఐదుగురు డైవర్లు క్లీన్-అప్ యాక్టివిటీలో పాల్గొన్నారు. ఖురియాత్ డైవర్స్ హెడ్ జుమా ఖమీస్ అల్ అమ్రి మాట్లాడుతూ.. ఖురియాత్ విలాయత్లోని అల్ హ్డాబ్ ప్రాంతంలో ఈ క్లీనప్ ప్రోగ్రామ్ జరిగిందన్నారు. డైవర్లు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు 13 మీటర్ల లోతు నుంచి 200 కిలోల ఫిషింగ్ నెట్లను తొలగించారని వివరించారు. క్లీన్-అప్ కార్యకలాపంతో పాటు కాలుష్య కారకాల నుండి పగడపు దిబ్బలను సంరక్షించడం, చేపలు పట్టే పరికరాల అవశేషాలు, వ్యర్థాలను డంపింగ్ చేయడాన్ని నిరోధించడం, కమ్యూనిటీలలో స్వచ్ఛంద సేవను ప్రోత్సహించడం వంటి వాటిపై అవగాహన కల్పించడం కూడా ఈ చొరవ లక్ష్యమన్నారు.
సముద్రాన్ని శుభ్రపరిచే కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పుడు డైవర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు విస్మరించిన ఫిషింగ్ నెట్ల నుండి వస్తుందని, ఇవి అనేక సముద్ర జీవుల మరణాలకు కూడా కారణమవుతాయని ఆయన అన్నారు. వ్యవసాయం, మత్స్య- జలవనరుల మంత్రిత్వ శాఖ, పర్యావరణ అథారిటీ, తీర రక్షక దళం సహకారంతో ఖురియాత్ డైవర్స్ ప్రచారంలో భాగంగా డిసెంబర్ 1న క్లీన్-అప్ కార్యకలాపం జరిగింది. ఆ తర్వాత నెలలో డిసెంబర్ 20న ఖురియాత్ డైవర్స్ పర్యావరణ అథారిటీ సహకారంతో దయమానియాత్ దీవులలో మరో పగడపు దిబ్బల క్లీన్-అప్ ప్రచారాన్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







