ఆర్థిక మోసం కేసులో 23 మంది ముఠాకు 111 ఏళ్ల జైలు శిక్ష
- December 20, 2022
రియాద్: ఆర్థిక మోసానికి పాల్పడినట్లు తేలిన తర్వాత సౌదీ కోర్టు 23 మంది వ్యక్తుల ముఠాకు 111 సంవత్సరాల జైలు శిక్ష, SR 28.6 మిలియన్ జరిమానా విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఇందులో మోసానికి పాల్పడ్డ వాణిజ్య సంస్థలు కూడా ఉన్నాయి. నేరానికి పాల్పడిన డబ్బుతో పాటు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జప్తు చేయాలని, జైలు శిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత ప్రవాసిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నేరస్థులు వర్చువల్ కరెన్సీలు, బంగారం, చమురు, ప్రీపెయిడ్ కార్డ్లు, విదేశీ అక్రమ పెట్టుబడులపై పెట్టుబడి పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. నకిలీ వ్యక్తులు, వాణిజ్య సంస్థల పేర్లతో విదేశాలకు డబ్బులను బదిలీ చేస్తారు. కొందరికి భారీగా లాభాలు ఇచ్చినట్లు తమ వెబ్ సైట్లలో ఫేక్ డాటాను పెట్టి.. ఇతరులకు వాటిని చూపుతూ మోసాలకు పాల్పడేవారు. కొందరికి మొదట్లో లాభాలు ఇవ్వడంతో ఇతురులు కూడా వారి మోసాల్లోవలలో పడి భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. నేరస్థులపై ఆర్థిక మోసం, మనీలాండరింగ్ తదితర చట్టాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై అరెస్టు చేసి, సమర్థ న్యాయస్థానానికి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు









