క్యాష్ లెస్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించిన 140 సంస్థలు
- December 20, 2022
మస్కట్: వినియోగదారులకు నగదు రహిత చెల్లింపు సేవలను అందించే నిబంధనలను దాదాపు 140 సంస్థలు ఉల్లంఘించిన్నట్లు వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) తెలిపింది. రెస్టారెంట్లు, కేఫ్లతో పాటు పారిశ్రామిక ప్రాంతాలు, కాంప్లెక్స్లు, వాణిజ్య కేంద్రాలు, గిఫ్ట్ మార్కెట్లు, ఆహారపదార్థాలు, బంగారం, వెండి వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఎలక్ట్రానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, పొగాకు విక్రయాలు వంటి ఎనిమిది వాణిజ్య కార్యకలాపాలలో క్యాష్ లెస్ సదుపాయం అందుబాటులో ఉన్నదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్లోని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో అన్ని సంస్థలు, కంపెనీలు తమ స్టోర్లు, అవుట్లెట్లలో ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను అందించడానికి కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫీజులు లావాదేవీ మొత్తంలో 15 శాతం లేదా డెబిట్ కార్డ్ల ద్వారా చెల్లింపు కోసం గరిష్టంగా RO10 లేదా QR కోడ్ ద్వారా మొబైల్ చెల్లింపుల కోసం 0.75% మించకూడదని పేర్కొంది. ఒమన్ విజన్ 2040 ప్రకారం.. సుల్తానేట్లో డిజిటల్ పరివర్తనను సాధించడానికి, చట్ట ఉల్లంఘనలను నివారించడానికి దుకాణాలు, అవుట్లెట్లలో ఎలక్ట్రానిక్ చెల్లింపు ఎంపికలను అందించడానికి అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ అన్ని వ్యాపార సముదాయాలు, కంపెనీలను కోరింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









