గాయపడిన కార్మికుడికి Dhs200,000 పరిహారం
- December 21, 2022
యూఏఈ: డ్యూటీలో గాయపడిన డ్రైవర్ కు పరిహారంగా Dhs 200,000 చెల్లించాలని ఓ కంపెనీని అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ఆదేశించింది. నిర్మాణంలో ఉన్న విల్లాలో పని చేస్తున్న సమయంలో సదరు కార్మికుడు(డ్రైవర్) 3 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఈ ఘటన గత మే నెలలో జరిగింది. డ్రైవర్ వాహనం ద్వారా కలపను తీసే క్రమంలో 3 మీటర్ల ఎత్తు నుండి నేలపై పడిపోయాడు. అతనిపై కలప పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకున్నాక కంపెనీపై కార్మికుడు దావా వేశాడు. కోర్టు ఫీజులు, న్యాయవాది రుసుములతో పాటు తనకు జరిగిన భౌతిక, నైతిక, మానసిక నష్టానికి పరిహారంగా Dhs400,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు. కార్మికుడి పరిస్థితిపై వైద్య నివేదికలో కార్మికుడికి ముక్కులో 10 శాతం శాశ్వత వైకల్యం, వెన్నెముక పనితీరులో 20 శాతం శాశ్వత వైకల్యం ఉందని పేర్కొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు నిర్ధారించింది. అయితే డ్రైవర్ కంపెనీ కోసం పని చేస్తున్నాడని, తన అధీనంలో ఉన్నవారి బాధ్యత కంపెనీదేనని కోర్టు సూచించింది. అందువల్ల, అన్ని నష్టాలకు పరిహారంగా కార్మికుడికి Dhs 200,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







