భారత్లో 2015లో 32,077 అత్యాచార కేసులు..
- April 27, 2016
భారత్లో 2015లో 32,077 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో వెల్లడించింది.ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయి పార్తీభాయ్ చౌదరి మాట్లాడారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన వివరాల ప్రకారం పై మేరకు అత్యాచార కేసులు నమోదైనట్లు తెలిపారు.వాటిలో 1,706 గ్యాంగ్ రేప్ కేసులు ఉన్నాయని చెప్పారు. అత్యాచార బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించనుందని చెప్పారు. హోంశాఖ పరిధిలో రూ.200 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నష్టపరిహార పథకం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న అత్యాచార బాధితులకు పరిహారం అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









