మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- April 22, 2026
గుజరాత్: గుజరాత్లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పెళ్లి వేడుకలో తీరని విషాదాన్ని నింపింది. వేసవి కాలంలో ఆహారం, ముఖ్యంగా పండ్ల రసాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ప్రమాదం మరోసారి హెచ్చరిస్తోంది.పెళ్లి విందులో భోజనం చేసిన అతిథులు భారీ సంఖ్యలో అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది.
దాహోద్ జిల్లాలోని అభ్లోద్ గ్రామంలో సోమవారం రాత్రి ఒక వివాహ వేడుక జరిగింది. విందు భోజనం ముగించుకున్న తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఒక్కొక్కరిగా అతిథులు అస్వస్థతకు గురయ్యారు.అతిథుల్లో సుమారు 400 మంది తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు.ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు వాంతులు చేసుకోవడంతో పెళ్లి పందిరి వద్ద భయానక వాతావరణం నెలకొంది.
మామిడి రసం తాగడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితులను తక్షణమే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 60 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) తీవ్రంగా స్పందించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర ఆహార కమిషనర్ను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







