వ్యక్తిని దోచుకున్న నలుగురికి 7 ఏళ్ల జైలు శిక్ష
- December 28, 2022
దుబాయ్: వ్యక్తిని కిడ్నాప్ చేసి 1.9 మిలియన్ దిర్హామ్లను దోచుకున్నందుకు నలుగురికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏడాది సెప్టెంబర్ లో డౌన్టౌన్ దుబాయ్లో జరిగింది. ఒక పెట్టుబడిదారుడు తన డ్రైవర్కి ఫోన్ చేసి గోల్డ్ సౌక్లో ఉన్న తన వర్క్ప్లేస్కి తీసుకెళ్లమని అడిగాడు. దారిలో వాహనంలో సమస్య ఉందని డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అనంతరం డ్రైవర్ అతని అనుచరులు కలిసి సదరు పెట్టుబడిదారుడిని దోచుకున్నారు. దర్యాప్తు బృందం సాక్ష్యాలను సేకరించి డ్రైవర్, అతని ఇద్దరు సహచరులను గుర్తించి అరెస్టు చేశారు. నాల్గవ నిందితుడు పనిచేసే పొలంలో దాచిన 1.6 మిలియన్ దిర్హామ్ లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి ఏడేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు బహిష్కరణను విధించింది. దోచుకున్న మొత్తాన్ని ఉమ్మడిగా చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









