వ్యక్తిని దోచుకున్న నలుగురికి 7 ఏళ్ల జైలు శిక్ష
- December 28, 2022
దుబాయ్: వ్యక్తిని కిడ్నాప్ చేసి 1.9 మిలియన్ దిర్హామ్లను దోచుకున్నందుకు నలుగురికి దుబాయ్ క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏడాది సెప్టెంబర్ లో డౌన్టౌన్ దుబాయ్లో జరిగింది. ఒక పెట్టుబడిదారుడు తన డ్రైవర్కి ఫోన్ చేసి గోల్డ్ సౌక్లో ఉన్న తన వర్క్ప్లేస్కి తీసుకెళ్లమని అడిగాడు. దారిలో వాహనంలో సమస్య ఉందని డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అనంతరం డ్రైవర్ అతని అనుచరులు కలిసి సదరు పెట్టుబడిదారుడిని దోచుకున్నారు. దర్యాప్తు బృందం సాక్ష్యాలను సేకరించి డ్రైవర్, అతని ఇద్దరు సహచరులను గుర్తించి అరెస్టు చేశారు. నాల్గవ నిందితుడు పనిచేసే పొలంలో దాచిన 1.6 మిలియన్ దిర్హామ్ లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి ఏడేళ్ల జైలుశిక్ష విధించడంతో పాటు బహిష్కరణను విధించింది. దోచుకున్న మొత్తాన్ని ఉమ్మడిగా చెల్లించాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







