కువైట్.. ఈ ఏడాది రోడ్డుప్రమాదాల్లో 170 మంది మృతి
- December 28, 2022
కువైట్: కువైట్ 2022 జనవరి 1, నవంబర్ 30 మధ్య 170 ట్రాఫిక్ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో దేశంలో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య దాదాపు 3.4 మిలియన్లు అని వెల్లడించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ప్లానింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ గణంకాలను విడుదల చేసింది. ఆరు గవర్నరేట్లలో జరిగిన మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలలో 92 శాతం డ్రైవింగ్లో అజాగ్రత్త కారణంగా సంభవించాయని, మిగిలిన 8 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయన్నారు. ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా మొత్తం మరణాల సంఖ్య 170 కేసులు కాగా, అత్యధికంగా అల్-జహ్రా గవర్నరేట్లో 52 మరణాలు చోటుచేసుకోగా.. అత్యల్పంగా హవల్లి గవర్నరేట్లో 10 మరణాలు సంభవించినట్లు గణాంకాలు తెలిపాయి. దుర్మరణం పాలయిన 170 మందిలో 152 మంది పురుషులు,18 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో అత్యధికంగా 42 మంది.. 31 -40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







