కువైట్.. ఈ ఏడాది రోడ్డుప్రమాదాల్లో 170 మంది మృతి
- December 28, 2022 
            కువైట్: కువైట్ 2022 జనవరి 1, నవంబర్ 30 మధ్య 170 ట్రాఫిక్ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో దేశంలో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య దాదాపు 3.4 మిలియన్లు అని వెల్లడించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ప్లానింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ గణంకాలను విడుదల చేసింది. ఆరు గవర్నరేట్లలో జరిగిన మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలలో 92 శాతం డ్రైవింగ్లో అజాగ్రత్త కారణంగా సంభవించాయని, మిగిలిన 8 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయన్నారు. ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా మొత్తం మరణాల సంఖ్య 170 కేసులు కాగా, అత్యధికంగా అల్-జహ్రా గవర్నరేట్లో 52 మరణాలు చోటుచేసుకోగా.. అత్యల్పంగా హవల్లి గవర్నరేట్లో 10 మరణాలు సంభవించినట్లు గణాంకాలు తెలిపాయి. దుర్మరణం పాలయిన 170 మందిలో 152 మంది పురుషులు,18 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో అత్యధికంగా 42 మంది.. 31 -40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







