కువైట్.. ఈ ఏడాది రోడ్డుప్రమాదాల్లో 170 మంది మృతి
- December 28, 2022
కువైట్: కువైట్ 2022 జనవరి 1, నవంబర్ 30 మధ్య 170 ట్రాఫిక్ సంబంధిత మరణాలు చోటు చేసుకున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో దేశంలో నమోదైన మొత్తం ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య దాదాపు 3.4 మిలియన్లు అని వెల్లడించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలోని ప్లానింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ గణంకాలను విడుదల చేసింది. ఆరు గవర్నరేట్లలో జరిగిన మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలలో 92 శాతం డ్రైవింగ్లో అజాగ్రత్త కారణంగా సంభవించాయని, మిగిలిన 8 శాతం ఇతర కారణాల వల్ల జరిగాయన్నారు. ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా మొత్తం మరణాల సంఖ్య 170 కేసులు కాగా, అత్యధికంగా అల్-జహ్రా గవర్నరేట్లో 52 మరణాలు చోటుచేసుకోగా.. అత్యల్పంగా హవల్లి గవర్నరేట్లో 10 మరణాలు సంభవించినట్లు గణాంకాలు తెలిపాయి. దుర్మరణం పాలయిన 170 మందిలో 152 మంది పురుషులు,18 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో అత్యధికంగా 42 మంది.. 31 -40 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







