ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- October 31, 2025
ఆసియా కప్ ముగిసిన నెల రోజులు గడిచినా ఇప్పటికీ ట్రోఫీ బీసీసీఐకి అందకపోవడం వివాదంగా మారింది. ఏసీసీ చీఫ్ నఖ్వీ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో బీసీసీఐకి అందజేయనున్నారని సమాచారం. నవంబర్ 4న జరగబోయే ICC మీటింగ్కు ముందు ఈ ప్రక్రియ పూర్తవుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, ట్రోఫీ అప్పగింతలో జాప్యం ఎందుకు జరుగుతోందన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
బీసీసీఐ సెక్రటరీ దేబోస్మిత్ సైకియా ఈ ఆలస్యంపై స్పష్టంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “టోర్నీ ముగిసిన తర్వాత ఇంత కాలం ట్రోఫీ ఇవ్వకపోవడం సరికాదు. బీసీసీఐ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ట్రోఫీ రాకపోతే ఈ విషయం ICC దృష్టికి తీసుకెళ్తాం,” అని హెచ్చరించారు. ఇక ట్రోఫీ అందిన వెంటనే అది ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ACC చీఫ్ నఖ్వీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే, బీసీసీఐ వర్గాలు ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లో ఉందని, అక్కడి నుండి త్వరలో భారత్కు పంపించనున్నారని చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ACC మరియు BCCI మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు మాత్రం ట్రోఫీ బీసీసీఐ చేతుల్లోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!







