ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- October 31, 2025
ఆసియా కప్ ముగిసిన నెల రోజులు గడిచినా ఇప్పటికీ ట్రోఫీ బీసీసీఐకి అందకపోవడం వివాదంగా మారింది. ఏసీసీ చీఫ్ నఖ్వీ ట్రోఫీని ఒకట్రెండు రోజుల్లో బీసీసీఐకి అందజేయనున్నారని సమాచారం. నవంబర్ 4న జరగబోయే ICC మీటింగ్కు ముందు ఈ ప్రక్రియ పూర్తవుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, ట్రోఫీ అప్పగింతలో జాప్యం ఎందుకు జరుగుతోందన్నది ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
బీసీసీఐ సెక్రటరీ దేబోస్మిత్ సైకియా ఈ ఆలస్యంపై స్పష్టంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “టోర్నీ ముగిసిన తర్వాత ఇంత కాలం ట్రోఫీ ఇవ్వకపోవడం సరికాదు. బీసీసీఐ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ట్రోఫీ రాకపోతే ఈ విషయం ICC దృష్టికి తీసుకెళ్తాం,” అని హెచ్చరించారు. ఇక ట్రోఫీ అందిన వెంటనే అది ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ACC చీఫ్ నఖ్వీ ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే, బీసీసీఐ వర్గాలు ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్లో ఉందని, అక్కడి నుండి త్వరలో భారత్కు పంపించనున్నారని చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ACC మరియు BCCI మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు మాత్రం ట్రోఫీ బీసీసీఐ చేతుల్లోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







