అపార్ట్మెంట్లోకి చొరబడి dh1.1 మిలియన్ల చోరీ.. ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- January 03, 2023
దుబాయ్: పోలీసులమని పెట్టుబడిదారుడి నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను దోచుకున్నందుకు ఐదుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత మార్చిలో నమోదైంది. పెట్టుబడిదారుడు తన నుండి, అతని బంధువు నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను కొందరు వ్యక్తులు పోలీసులమని దొంగిలించారని రిపోర్టు దాఖలు చేశారు. దుండగులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి బాధితులపై దాడి చేశారు. డ్రాయర్లో ఉన్న 1.1 మిలియన్ దిర్హామ్లను తీసుకొని పారిపోయారు. దర్యాప్తు బృందం ముఠా సభ్యులను గుర్తించి, వారిలో ఒకరిని దుబాయ్ విమానాశ్రయంలో దేశం విడిచి వెళుతుండగా అరెస్టు చేసింది. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మిగతా వారిని అరెస్ట్ చేశారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ వారందరినీ దోషులుగా నిర్ధారించింది. వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించాలని ఆదేశించింది. అప్పీల్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







