అపార్ట్మెంట్లోకి చొరబడి dh1.1 మిలియన్ల చోరీ.. ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- January 03, 2023
దుబాయ్: పోలీసులమని పెట్టుబడిదారుడి నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను దోచుకున్నందుకు ఐదుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత మార్చిలో నమోదైంది. పెట్టుబడిదారుడు తన నుండి, అతని బంధువు నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను కొందరు వ్యక్తులు పోలీసులమని దొంగిలించారని రిపోర్టు దాఖలు చేశారు. దుండగులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి బాధితులపై దాడి చేశారు. డ్రాయర్లో ఉన్న 1.1 మిలియన్ దిర్హామ్లను తీసుకొని పారిపోయారు. దర్యాప్తు బృందం ముఠా సభ్యులను గుర్తించి, వారిలో ఒకరిని దుబాయ్ విమానాశ్రయంలో దేశం విడిచి వెళుతుండగా అరెస్టు చేసింది. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మిగతా వారిని అరెస్ట్ చేశారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ వారందరినీ దోషులుగా నిర్ధారించింది. వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించాలని ఆదేశించింది. అప్పీల్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









