హైదరాబాద్ మెట్రో టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన..
- January 03, 2023
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మెట్రో టికెటింగ్ లో సేవలు అందిస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
జీతాలు పెంచాలని నిన్న సాయంత్రమే ఏజెన్సీకి ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. కానీ ఇవాళ ఉదయం వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులకు హారు కాలేదు. దీంతో ఇతర ఉద్యోగులను కౌంటర్లతో కూర్చోబెట్టి మెట్రో అధికారులు టికెట్లు జారీ చేయిస్తున్నారు.
ఇతర ఉద్యోగులతో టికెట్లు జారీ చేయిస్తుండటంతో ఆలస్యం అవుతుంది. దీంతో టికెట్ల కోసం కొన్ని మెట్రో స్టేషన్ లలో ప్రయాణికులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఎల్ బీనగర్-మియాపూర్ కారిడార్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







