జాన్వీ కోరిక ఇప్పటికైనా నెరవేరబోతోందా.?
- January 03, 2023
‘మిలి’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. నార్త్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్తో చెలరేగిపోతున్న జాన్వీ కపూర్ సౌత్లోనూ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.
తనకు జూనియర్ ఎన్టీయార్ అంటే చాలా ఇష్టమని పలు మార్లు చెప్పిన జాన్వీ కపూర్, ఆయన సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్బోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జాన్వీ సౌత్ ఎంట్రీపై కథనాలు వస్తున్నాయ్ కానీ, అవి నిజం కాలేదు.
ఈ సారి మాత్రం కొరటాల - ఎన్టీయార్ సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్గా లాక్ చేసినట్లు ఇన్సైడ్ సోర్సెస్ టాక్. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ, జాన్వీని ఈ సినిమాకి ఫిక్స్ చేశారట.
సో, అలా జాన్వీ కోరిక నెరవేరిపోతోందన్నమాట. ఇకపోతే, ‘మిలి’ చిత్రం రీసెంట్గా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యింది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. జాన్వీ కపూర్ వన్ విమెన్ షోగా ఆధ్యంతం ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తోంది ‘మిలి’గా.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









