ఒంగోలు లో వీరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక
- January 03, 2023
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 06 న ఒంగోలు లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా తెరకెక్కుతున్న మూవీ వీరసింహారెడ్డి. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..ఇక సినిమా తాలూకా ప్రీ రిలీజ్ వేడుక ను ఒంగోలులోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో, ఈ నెల 6వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు.ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు.రామ్ లక్ష్మణ్ ఫైట్స్.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ నుండి వస్తున్న సినిమా కావడం , క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని వీరిద్దరి కలయిక లో ఈ సినిమా వస్తుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. మరి ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









