అల్ లాజీ సరస్సును పరిశీలించిన అల్ అస్ఫూర్
- January 08, 2023
బహ్రెయిన్: రాజ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదల నియంత్రణ చర్యలను ఉత్తర గవర్నర్ అలీ బిన్ షేక్ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫూర్ సమీక్షించారు. వరద నీటి తొలగింపునకు అధిక సామర్థ్యం గల పంపులను వ్యవస్థాపించి, వర్షపు నీటి పారుదల మార్గాలకు వాటిని కనెక్ట్ చేసినందుకు వర్క్స్ మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అల్ లాజీ సరస్సు సామర్థ్యాన్ని పెంచడానికి, వర్షపు నీటి కాలువలు, కాలువల విస్తరణ కోసం చేపట్టిన పనుల పురోగతిని అల్ అస్ఫూర్ పరిశీలించారు. ఉత్తర గవర్నర్ హమద్ టౌన్లోని అల్ లాజీ ప్రాంతం, సరస్సును సందర్శించి వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల భద్రతను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతను నిర్ధారించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా జారీ చేసిన ఆదేశాలపై కూడా అధికారుతో సమీక్షించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!









