నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపునకు చర్యలు!
- January 08, 2023
కువైట్: నైపుణ్యం లేని నిర్వాసితుల సంఖ్యను తగ్గించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇఖామా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవడానికి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన వారిని పట్టుకోవడానికి, ప్రధానంగా బహిష్కృత జనాభా ఉన్న ప్రాంతాల్లో తనిఖీ ప్రచారాలు చేపట్టే చట్టాన్ని తెచ్చేందుకు ఇప్పటికే ముసాయిదా చట్టాన్ని జాతీయ అసెంబ్లీకి పంపనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అవసరమైన వారికి తప్ప ఈ ఏడాది మరేవరికీ అనుమతులు ఇవ్వకూడదని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించిన తెలుస్తోంది. లేబర్ మార్కెట్కు అవసరం లేకపోతే లేబర్ అనుమతులు ఈ సంవత్సరం పునరుద్ధరించబడవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికులను తీసుకువచ్చే వ్యాపారులపై రుసుము విధించేందుకు ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుందని సమాచారం. ఫీజులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని నిర్ధారించడానికి అధ్యయనం చేయబడుతుందని మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రవాసుల ఇఖామాల గురించి గతంలో చాలా మంది ఎంపీలతో అంతర్గ మంత్రిత్వ శాఖ మంత్రి చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







