నైపుణ్యం లేని కార్మికుల తగ్గింపునకు చర్యలు!
- January 08, 2023
కువైట్: నైపుణ్యం లేని నిర్వాసితుల సంఖ్యను తగ్గించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇఖామా ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవడానికి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన వారిని పట్టుకోవడానికి, ప్రధానంగా బహిష్కృత జనాభా ఉన్న ప్రాంతాల్లో తనిఖీ ప్రచారాలు చేపట్టే చట్టాన్ని తెచ్చేందుకు ఇప్పటికే ముసాయిదా చట్టాన్ని జాతీయ అసెంబ్లీకి పంపనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అవసరమైన వారికి తప్ప ఈ ఏడాది మరేవరికీ అనుమతులు ఇవ్వకూడదని అంతర్గత మంత్రిత్వ శాఖ నిర్ణయించిన తెలుస్తోంది. లేబర్ మార్కెట్కు అవసరం లేకపోతే లేబర్ అనుమతులు ఈ సంవత్సరం పునరుద్ధరించబడవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికులను తీసుకువచ్చే వ్యాపారులపై రుసుము విధించేందుకు ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తుందని సమాచారం. ఫీజులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని నిర్ధారించడానికి అధ్యయనం చేయబడుతుందని మంత్రిత్వ శాఖలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రవాసుల ఇఖామాల గురించి గతంలో చాలా మంది ఎంపీలతో అంతర్గ మంత్రిత్వ శాఖ మంత్రి చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









