591 మంది డ్రగ్స్ స్మగ్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

- January 09, 2023 , by Maagulf
591 మంది డ్రగ్స్ స్మగ్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

రియాద్ : సౌదీ అరేబియాలోకి డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో 591 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదివారం ప్రకటించింది. నిందితులు 4 నెలల్లో రాజ్యానికి డ్రగ్స్‌ను రవాణా చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ 257 స్మగ్లింగ్ కేసులను కింగ్‌డమ్‌లోని ప్రాంతాలు, గవర్నరేట్‌లలో డ్రగ్ ప్రాసిక్యూషన్‌ల ద్వారా నమోదు చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, నేరస్థులు అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన మాదకద్రవ్యాల పరిమాణం 40 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు కాగా, హషీష్ బరువు 2.5 టన్నులు, షాబు బరువు 800 కిలోలకు చేరుకుంది. రాజ్యంలో మాదకద్రవ్యాల కేసుల్లో నైపుణ్యం కలిగిన నియంత్రణ అధికారులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిందితులను వెంబడించడం, వారిని అరెస్టు చేయడం, కింగ్డమ్ లోని అన్ని భూమి, సముద్రం,  ఎయిర్ పోర్ట్‌లలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com