బ్రెజిల్లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు..
- January 09, 2023
బ్రెజిల్: బ్రెజిల్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. నిరసనకారులు నేషనల్ కాంగ్రెస్ భవనంపై దాడి చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించిన ఆందోళనకారులు అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. బ్రెజిల్ లో 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం లులా డా సిల్వా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే, బోల్సొనారో మద్దతుదారులు ఇప్పటికీ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. రాజకీయ అంశంలో తమ దేశ సైన్యం జోక్యం చేసుకోవాలని, పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని వారు ఆరోపిస్తున్నారు. అధ్యక్ష భవనం వద్దకు వెళ్లి విధ్వంసానికి పాల్పడి బీభత్సం సృష్టించారు.
గతంలో అమెరికాలోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడిని ఈ ఘటన తలపిస్తోంది. ఈ ఘటనను అధ్యక్షు లులా డా సిల్వా ఖండించారు. నిరసనకారులు చేసిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. బ్రెజిల్ లో పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్న ఆందోళనల పై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు.
‘‘బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. బ్రెజిల్ లో చోటుచేసుకున్న ఘటనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఖండించారు. అలాగే, ఇటువంటి దాడులు సరికాదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ అన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







