సౌదీలో సందడిగా 'సంక్రాంతి ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలు
- January 09, 2023
సౌదీ: రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంక్రాంతి సంబరాలు - 2023 ఆధ్వర్యంలో శుక్రవారము "సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో "రియాద్ సూపర్ కింగ్స్ (మహేంద్ర వాకాటి నాయకత్వములో )", "సంక్రాంతి సన్ రైజర్స్ (ప్రసాద్ RVP)", "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్ (హేమంత్)", "తెలుగు టైటాన్స్ - రైడర్స్ (ఇబ్రహీం షేక్)" తలపడగా.. ఫైనల్స్ కు "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్", "తెలుగు టైటాన్స్ - రైడర్స్" చేరుకున్నాయి.ఫైనల్స్ మ్యాచులో "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్" విజేతగా నిలిచారు.
"సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు విజయవంతమయ్యేందుకు సహకరించిన అన్ని జట్టుల ఆటగాళ్లకు, కుటుంబ సమేతముగా ఈ క్రికెట్ పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి "రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం" కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ క్రికెట్ పోటీలకు ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతి, ట్రోఫీస్ లను "సుఖేష్, గుత్తు ఇండియన్ రెస్టారెంట్, స్వామి, బిందు భాస్కర్", ఆటగాళ్లకు బహుకరించే మెడల్స్ ను "నరేంద్ర పెళ్లూరు'' ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ క్రికెట్ పోటీలలో పాలుగొన్న క్రీడాకారులకు "నాగేంద్ర, ఇబ్రహీం షేక్, శేషుబాబు" స్నాక్స్, అల్పాహారం సమకూర్చారు.గెలిచిన జట్టుకు, ఆడిన ఆటగాళ్లందరికి జనవరి 13వ తేదీన నిర్వహించే సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేయనున్నారు.




తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









