సౌదీలో సందడిగా 'సంక్రాంతి ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలు
- January 09, 2023
సౌదీ: రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంక్రాంతి సంబరాలు - 2023 ఆధ్వర్యంలో శుక్రవారము "సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో "రియాద్ సూపర్ కింగ్స్ (మహేంద్ర వాకాటి నాయకత్వములో )", "సంక్రాంతి సన్ రైజర్స్ (ప్రసాద్ RVP)", "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్ (హేమంత్)", "తెలుగు టైటాన్స్ - రైడర్స్ (ఇబ్రహీం షేక్)" తలపడగా.. ఫైనల్స్ కు "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్", "తెలుగు టైటాన్స్ - రైడర్స్" చేరుకున్నాయి.ఫైనల్స్ మ్యాచులో "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్" విజేతగా నిలిచారు.
"సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు విజయవంతమయ్యేందుకు సహకరించిన అన్ని జట్టుల ఆటగాళ్లకు, కుటుంబ సమేతముగా ఈ క్రికెట్ పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి "రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం" కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ క్రికెట్ పోటీలకు ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతి, ట్రోఫీస్ లను "సుఖేష్, గుత్తు ఇండియన్ రెస్టారెంట్, స్వామి, బిందు భాస్కర్", ఆటగాళ్లకు బహుకరించే మెడల్స్ ను "నరేంద్ర పెళ్లూరు'' ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ క్రికెట్ పోటీలలో పాలుగొన్న క్రీడాకారులకు "నాగేంద్ర, ఇబ్రహీం షేక్, శేషుబాబు" స్నాక్స్, అల్పాహారం సమకూర్చారు.గెలిచిన జట్టుకు, ఆడిన ఆటగాళ్లందరికి జనవరి 13వ తేదీన నిర్వహించే సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేయనున్నారు.




తాజా వార్తలు
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!
- కువైట్లో నేడు క్లాసెస్ రద్దు..!!
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!







