సౌదీలో సందడిగా 'సంక్రాంతి ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలు
- January 09, 2023
సౌదీ: రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంక్రాంతి సంబరాలు - 2023 ఆధ్వర్యంలో శుక్రవారము "సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో "రియాద్ సూపర్ కింగ్స్ (మహేంద్ర వాకాటి నాయకత్వములో )", "సంక్రాంతి సన్ రైజర్స్ (ప్రసాద్ RVP)", "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్ (హేమంత్)", "తెలుగు టైటాన్స్ - రైడర్స్ (ఇబ్రహీం షేక్)" తలపడగా.. ఫైనల్స్ కు "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్", "తెలుగు టైటాన్స్ - రైడర్స్" చేరుకున్నాయి.ఫైనల్స్ మ్యాచులో "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్" విజేతగా నిలిచారు.
"సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు విజయవంతమయ్యేందుకు సహకరించిన అన్ని జట్టుల ఆటగాళ్లకు, కుటుంబ సమేతముగా ఈ క్రికెట్ పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి "రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం" కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ క్రికెట్ పోటీలకు ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతి, ట్రోఫీస్ లను "సుఖేష్, గుత్తు ఇండియన్ రెస్టారెంట్, స్వామి, బిందు భాస్కర్", ఆటగాళ్లకు బహుకరించే మెడల్స్ ను "నరేంద్ర పెళ్లూరు'' ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ క్రికెట్ పోటీలలో పాలుగొన్న క్రీడాకారులకు "నాగేంద్ర, ఇబ్రహీం షేక్, శేషుబాబు" స్నాక్స్, అల్పాహారం సమకూర్చారు.గెలిచిన జట్టుకు, ఆడిన ఆటగాళ్లందరికి జనవరి 13వ తేదీన నిర్వహించే సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేయనున్నారు.




తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









