గుండెపోటుతో మరణించిన 12 ఏళ్ల బాలుడు

- January 09, 2023 , by Maagulf
గుండెపోటుతో మరణించిన 12 ఏళ్ల బాలుడు

కర్ణాటక: మాములుగా గుండెపోటు 50 ఏళ్లకు పైబడిన వారికీ వస్తుంటుంది. కానీ ఇటీవల కాలంలో 25 ఏళ్ల పైబడిన వారికీ సైతం వస్తుంది. ఇదే అనుకుంటే ఇప్పుడు ఆదుకునే వయసు 12 ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని మడికేరి జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు.

శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ తల్లడిల్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్దారించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అంత చిన్న వయసులో గుండెనొప్పి రావడం ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com