గుండెపోటుతో మరణించిన 12 ఏళ్ల బాలుడు
- January 09, 2023
కర్ణాటక: మాములుగా గుండెపోటు 50 ఏళ్లకు పైబడిన వారికీ వస్తుంటుంది. కానీ ఇటీవల కాలంలో 25 ఏళ్ల పైబడిన వారికీ సైతం వస్తుంది. ఇదే అనుకుంటే ఇప్పుడు ఆదుకునే వయసు 12 ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని మడికేరి జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు.
శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ తల్లడిల్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్దారించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అంత చిన్న వయసులో గుండెనొప్పి రావడం ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







