సెన్సార్ పూర్తి చేసుకున్న 'వీరసింహారెడ్డి'..!
- January 09, 2023
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే అన్నిపనులు ముగించుకున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
వీరసింహారెడ్డి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఈ సినిమా పూర్తిగా బాలయ్య మార్క్ మూవీగా వచ్చిందని, అభిమానులకు ఈ సినిమాతో బాలయ్య కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, ఆయన నోటివెంట వచ్చిన పలు డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్లో కనిపిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ను అందిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!







