ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..
- January 09, 2023
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) విస్తరణలో భాగంగా బహిరంగ సభల ఏర్పాటుకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలోనే మొదటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రాతిపాదించింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారు.
కేజ్రీవాల్, భగవంత మాన్, అఖిలేష్ యాదవ్ లు అంగీకారం తెలపగా కేరళ సీఎం పినరయి విజయన్ తన నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించనున్నారు. ఈ నెల 18న ఖమ్మం కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని వంద ఎకరాల మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు లక్షమందికి పైగా జన సమీకరణ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. బహిరంగ సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. మొదట ఢిల్లీలో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని అనుకున్నా.. అనంతరం సభ వేదిక ఖమ్మంకు మారింది. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఖమ్మం ఉంది. ఛత్తీస్ గడ్ లో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









