నేటి నుంచే ఒమన్ డి20 లీగ్
- January 11, 2023
మస్కట్: ఒమన్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒమన్ D20 లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఒమన్ క్రికెట్ లీగ్ 24 జనవరి 2023 వరకు తన రెండవ ఎడిషన్ జరుగనున్నది. అన్ని మ్యాచ్లు ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్లోని టర్ఫ్ 1లో రౌండ్-రాబిన్ ఫార్మాట్లో నిర్వహించబడతాయి. డబుల్ హెడర్ మ్యాచ్లు వారాంతపు రోజులలో మధ్యాహ్నం 2:30, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి. ట్రిపుల్ హెడర్ మ్యాచ్లు వారాంతాల్లో వరుసగా ఉదయం 10:30, 2:30, సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి. D20 టోర్నమెంట్లో ఖురమ్ థండర్స్, అమెరట్ రాయల్స్, అజైబా XI, బౌషర్ బస్టర్స్, ఖువైర్ వారియర్స్, ఘుబ్రాహ్ జెయింట్స్, దర్సైత్ టైటాన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ - రువీ రేంజర్స్ పాల్గొంటున్నాయని ఒమన్ క్రికెట్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దులీప్ మెండిస్ తెలిపారు. ఒమన్ D20 లీగ్ను భారతదేశంలోని ఫ్యాన్కోడ్, పాకిస్తాన్లోని జియోస్పోర్ట్స్, యుఎస్, కెనడాలోని విల్లో టీవీ, మిడిల్ ఈస్ట్లోని క్రిక్లైఫ్2, స్విచ్ టీవీ లు ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







