ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గ్యాస్ సిలిండర్ పేలుడులో దుర్మరణం

- January 12, 2023 , by Maagulf
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గ్యాస్ సిలిండర్ పేలుడులో దుర్మరణం

హర్యానా:  హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పానిపట్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పానిపట్‌లోని తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలోని ఓ ఇంటిలో ఈ పేలుడు సంభవించింది. గ్యాస్ సిలీండర్ పేలుడు సమయంలో ఇంట్లో ఉన్న భార్యాభర్తలు, నలుగురు పిల్లలు మంటల్లో సజీవదహనమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోనివారు బయటకు వచ్చేందుకు అవకాశంలేకుండా పోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com