త్వరలోనే ఒమన్ లో యూపీఐ చెల్లింపులు
- January 13, 2023
మస్కట్: ఒమన్ తో సహా ఇతర తొమ్మిది దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) త్వరలోనే తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, 10 దేశాల్లోని ప్రవాస భారతీయులు (NRIలు) వారి భారతదేశ ఫోన్ నంబర్పై ఆధారపడకుండా లావాదేవీల కోసం UPI సేవలను యాక్సెస్ చేయవచ్చు. యూఏఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చే 10 దేశాల్లో ఒమన్, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే ఉన్నాయి. ఆయా దేశాలు ఏప్రిల్ 30 లోపు యూపీఏ పేమెంట్లను మొదలు పెడతాయని ఎన్పీసీఐ తెలిపింది. మరోవైపు రూపే డెబిట్ కార్డ్లు, తక్కువ-విలువైన BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించడానికి INR2,600 కోట్ల పథకానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







