త్వరలోనే ఒమన్ లో యూపీఐ చెల్లింపులు
- January 13, 2023
మస్కట్: ఒమన్ తో సహా ఇతర తొమ్మిది దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) త్వరలోనే తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, 10 దేశాల్లోని ప్రవాస భారతీయులు (NRIలు) వారి భారతదేశ ఫోన్ నంబర్పై ఆధారపడకుండా లావాదేవీల కోసం UPI సేవలను యాక్సెస్ చేయవచ్చు. యూఏఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చే 10 దేశాల్లో ఒమన్, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే ఉన్నాయి. ఆయా దేశాలు ఏప్రిల్ 30 లోపు యూపీఏ పేమెంట్లను మొదలు పెడతాయని ఎన్పీసీఐ తెలిపింది. మరోవైపు రూపే డెబిట్ కార్డ్లు, తక్కువ-విలువైన BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించడానికి INR2,600 కోట్ల పథకానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ









