దుబాయ్ లో ప్రపంచంలోనే తొలి 3డి ప్రింటింగ్ మస్జీదు నిర్మాణం
- January 14, 2023
దుబాయ్: ప్రపంచంలోనే తొలిసారిగా 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో మస్జీదును దుబాయ్ లో నిర్మిస్తున్నారు. ఇది ఒక విశిష్టమైన ప్రాజెక్ట్ అని దుబాయ్లోని ఇస్లామిక్ అఫైర్స్ & ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హమద్ బిన్ అల్ షేక్ అహ్మద్ అల్ షైబానీ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను దృష్టిలో పెట్టుకొని మస్జీజు నిర్మారణం చేపట్టామన్నారు. ఈ నిర్మాణం ప్రపంచ కేంద్రంగా దుబాయ్ స్థానాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అనేది 3డి ప్రింటర్ని ఉపయోగించి పనిని పూర్తి చేసే ప్రక్రియ అని ఇంజినీరింగ్ విభాగం అధిపతి ఇంజినీర్ అలీ అల్-హలియన్ అల్-సువైది తెలిపారు. ఇది డిజిటల్గా నియంత్రించబడే యంత్రం అని, ఇది ముడి , పారిశ్రామిక సంకలనాలను మిళితం చేస్తుందని వివరించారు. నిర్మాణ పనులకు అయ్యే ఖర్చు స్వల్పంగా పెరిగినా.. నిర్మాణ సమయాన్ని 3డీ టెక్నాలజీ తగ్గిస్తుందని చెప్పారు. 3డీ మస్జీదు 2023 నాల్గవ త్రైమాసికం కల్లా పూర్తి అవుతుందని తెలిపారు. ఈ మస్జీదులో దాదాపు 600 మంది ఆరాధకులు ప్రార్థనలు చేయొచ్చని, భవనం విస్తీర్ణం 2000 చదరపు అడుగులు ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







