దుబాయ్ లో ప్రపంచంలోనే తొలి 3డి ప్రింటింగ్ మస్జీదు నిర్మాణం
- January 14, 2023
దుబాయ్: ప్రపంచంలోనే తొలిసారిగా 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో మస్జీదును దుబాయ్ లో నిర్మిస్తున్నారు. ఇది ఒక విశిష్టమైన ప్రాజెక్ట్ అని దుబాయ్లోని ఇస్లామిక్ అఫైర్స్ & ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హమద్ బిన్ అల్ షేక్ అహ్మద్ అల్ షైబానీ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను దృష్టిలో పెట్టుకొని మస్జీజు నిర్మారణం చేపట్టామన్నారు. ఈ నిర్మాణం ప్రపంచ కేంద్రంగా దుబాయ్ స్థానాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అనేది 3డి ప్రింటర్ని ఉపయోగించి పనిని పూర్తి చేసే ప్రక్రియ అని ఇంజినీరింగ్ విభాగం అధిపతి ఇంజినీర్ అలీ అల్-హలియన్ అల్-సువైది తెలిపారు. ఇది డిజిటల్గా నియంత్రించబడే యంత్రం అని, ఇది ముడి , పారిశ్రామిక సంకలనాలను మిళితం చేస్తుందని వివరించారు. నిర్మాణ పనులకు అయ్యే ఖర్చు స్వల్పంగా పెరిగినా.. నిర్మాణ సమయాన్ని 3డీ టెక్నాలజీ తగ్గిస్తుందని చెప్పారు. 3డీ మస్జీదు 2023 నాల్గవ త్రైమాసికం కల్లా పూర్తి అవుతుందని తెలిపారు. ఈ మస్జీదులో దాదాపు 600 మంది ఆరాధకులు ప్రార్థనలు చేయొచ్చని, భవనం విస్తీర్ణం 2000 చదరపు అడుగులు ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







