రస్ అల్ ఖైమా నుంచి గ్లోబల్ విలేజ్కు బస్సు సర్వీస్ ప్రారంభం
- January 15, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా నివాసితులు పబ్లిక్ బస్సు ద్వారా నేరుగా దుబాయ్లోని ప్రముఖ ఫెస్టివల్ పార్క్ గ్లోబల్ విలేజ్కు చేరుకోవచ్చు. వన్-వే టిక్కెట్ ధర 30 దిర్హామ్ లుగా అధికారులు నిర్ణయించారు. నివాసితుల నుండి వచ్చిన డిమాండ్ మేరకు ఈ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు రాస్ అల్ ఖైమా ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RAKTA), దుబాయ్, గ్లోబల్ విలేజ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) లు సంయక్త ప్రకటనలో తెలిపారు. బస్సు సర్వీస్ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం రెండు రౌండ్ట్రిప్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రస్ అల్ ఖైమా నుండి గ్లోబల్ విలేజ్కి మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి గ్లోబల్ పార్క్ నుండి తిరిగి ఎమిరేట్కి రాత్రి 10, 12 గంటలకు ప్రయాణం అవుతుంది. ప్రయాణీకులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని RAKTA క్వాలిటీ అండ్ ఆపరేషన్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ హషేమ్ ఎస్మాయీల్ తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







