రస్ అల్ ఖైమా నుంచి గ్లోబల్ విలేజ్కు బస్సు సర్వీస్ ప్రారంభం
- January 15, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా నివాసితులు పబ్లిక్ బస్సు ద్వారా నేరుగా దుబాయ్లోని ప్రముఖ ఫెస్టివల్ పార్క్ గ్లోబల్ విలేజ్కు చేరుకోవచ్చు. వన్-వే టిక్కెట్ ధర 30 దిర్హామ్ లుగా అధికారులు నిర్ణయించారు. నివాసితుల నుండి వచ్చిన డిమాండ్ మేరకు ఈ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు రాస్ అల్ ఖైమా ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RAKTA), దుబాయ్, గ్లోబల్ విలేజ్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) లు సంయక్త ప్రకటనలో తెలిపారు. బస్సు సర్వీస్ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం రెండు రౌండ్ట్రిప్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రస్ అల్ ఖైమా నుండి గ్లోబల్ విలేజ్కి మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి గ్లోబల్ పార్క్ నుండి తిరిగి ఎమిరేట్కి రాత్రి 10, 12 గంటలకు ప్రయాణం అవుతుంది. ప్రయాణీకులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని RAKTA క్వాలిటీ అండ్ ఆపరేషన్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ హషేమ్ ఎస్మాయీల్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









