వినియోగదారుల రక్షణ అథారిటీ దాడులు.. 55 దుకాణాలకు నోటీసులు
- January 15, 2023
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్లో వినియోగదారుల రక్షణ అథారిటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా 50కి పైగా వాణిజ్య దుకాణాలపై దాడులు నిర్వహించింది. పొగాకు, సిగరెట్లు, వాటి ఉత్పన్నాలను విక్రయించే దుకాణాలు, కిరాణా, ఇస్త్రీ దుకాణాలపై ఆకస్మిక తనిఖీ ప్రచారాన్ని కన్స్యూమర్ సర్వీసెస్, మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ నిర్వహించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన అనేక వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంపెయిన్ నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని అన్ని విలాయత్లలో జరిగాయి. ఈ సందర్భంగా నమిలేపొగాకు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు(144) స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 దుకాణాలకు నోటీసులు అందజేసినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









