వినియోగదారుల రక్షణ అథారిటీ దాడులు.. 55 దుకాణాలకు నోటీసులు
- January 15, 2023
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్లో వినియోగదారుల రక్షణ అథారిటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా 50కి పైగా వాణిజ్య దుకాణాలపై దాడులు నిర్వహించింది. పొగాకు, సిగరెట్లు, వాటి ఉత్పన్నాలను విక్రయించే దుకాణాలు, కిరాణా, ఇస్త్రీ దుకాణాలపై ఆకస్మిక తనిఖీ ప్రచారాన్ని కన్స్యూమర్ సర్వీసెస్, మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ నిర్వహించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన అనేక వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంపెయిన్ నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని అన్ని విలాయత్లలో జరిగాయి. ఈ సందర్భంగా నమిలేపొగాకు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు(144) స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 దుకాణాలకు నోటీసులు అందజేసినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు మద్దతు..ఖతార్ రైల్ సన్ఫ్లవర్ ప్రోగ్రామ్..!!
- సాహెల్ యాప్ ద్వారా దేశీయ డ్రైవర్ వీసా సేవలు..!!
- దుబాయ్లోని దుకాణ యజమానులకు సైన్ బోర్డు రూల్స్..!!
- రియాద్లో జీసీసీ మంత్రుల అత్యవసర సమావేశం..!!
- ఏడాదిలో ఏడు కంటే ఎక్కువ ఉద్యోగాలను కలిగి ఉండటంపై నిషేధం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన జీసీసీ జుడిషియల్ మీటింగ్..!!
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు









