వినియోగదారుల రక్షణ అథారిటీ దాడులు.. 55 దుకాణాలకు నోటీసులు
- January 15, 2023
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్లో వినియోగదారుల రక్షణ అథారిటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా 50కి పైగా వాణిజ్య దుకాణాలపై దాడులు నిర్వహించింది. పొగాకు, సిగరెట్లు, వాటి ఉత్పన్నాలను విక్రయించే దుకాణాలు, కిరాణా, ఇస్త్రీ దుకాణాలపై ఆకస్మిక తనిఖీ ప్రచారాన్ని కన్స్యూమర్ సర్వీసెస్, మార్కెట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ నిర్వహించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన అనేక వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంపెయిన్ నార్త్ అల్ బతినా గవర్నరేట్లోని అన్ని విలాయత్లలో జరిగాయి. ఈ సందర్భంగా నమిలేపొగాకు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు(144) స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 దుకాణాలకు నోటీసులు అందజేసినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







