మొబైల్ డ్రైవింగ్ ఉల్లంఘనల గుర్తింపునకు కొత్త స్మార్ట్ కెమెరాలు
- January 15, 2023
కువైట్: కువైట్ రోడ్ల వెంబడి ఇటీవలే స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటితో వాహనదారుల భద్రత మరింత పెరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్ అధికారి తెలిపారు. ఈ హై-సెన్సిటివిటీ కెమెరాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గుర్తించగలవని రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తౌహీద్ అల్-కందారి వెల్లడించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలపై వేగ పరిమితి, సిగ్నల్స్ ఉల్లంఘనలను కొత్త కెమెరాలు గుర్తిస్తాయన్నారు. ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడానికి, చట్టాన్ని ఉల్లంఘించే డ్రైవర్లను గుర్తించడానికి ఇటువంటి కెమెరాలను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డ్రైవింగ్లో మొబైల్ సెట్ల అక్రమ వినియోగం, సీటు బెల్ట్ను ఉపయోగించకపోవడం, రాంగ్ డ్రైవింగ్, ప్రధాన రహదారులపై యూ టర్న్ వంటి వాటిని పర్యవేక్షించడానికి రోడ్లపై ఆ తరహా కెమెరాలను ఇన్స్టాల్ చేస్తున్నట్లు ఇటీవల అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో జనవరి 1 నుంచి నవంబర్ చివరి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనల మొత్తం 3.4 మిలియన్లకు చేరిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా 170 మంది మరణించారు.
తాజా వార్తలు
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- దుబాయ్లో మరిన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్..!!









