మొబైల్ డ్రైవింగ్ ఉల్లంఘనల గుర్తింపునకు కొత్త స్మార్ట్ కెమెరాలు
- January 15, 2023
కువైట్: కువైట్ రోడ్ల వెంబడి ఇటీవలే స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటితో వాహనదారుల భద్రత మరింత పెరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్ అధికారి తెలిపారు. ఈ హై-సెన్సిటివిటీ కెమెరాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గుర్తించగలవని రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తౌహీద్ అల్-కందారి వెల్లడించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలపై వేగ పరిమితి, సిగ్నల్స్ ఉల్లంఘనలను కొత్త కెమెరాలు గుర్తిస్తాయన్నారు. ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడానికి, చట్టాన్ని ఉల్లంఘించే డ్రైవర్లను గుర్తించడానికి ఇటువంటి కెమెరాలను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డ్రైవింగ్లో మొబైల్ సెట్ల అక్రమ వినియోగం, సీటు బెల్ట్ను ఉపయోగించకపోవడం, రాంగ్ డ్రైవింగ్, ప్రధాన రహదారులపై యూ టర్న్ వంటి వాటిని పర్యవేక్షించడానికి రోడ్లపై ఆ తరహా కెమెరాలను ఇన్స్టాల్ చేస్తున్నట్లు ఇటీవల అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో జనవరి 1 నుంచి నవంబర్ చివరి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనల మొత్తం 3.4 మిలియన్లకు చేరిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా 170 మంది మరణించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







