మొదటి టర్మ్ పరీక్షల్లో రాణించని విద్యార్థుల కోసం కొత్త ప్రోగ్రామ్
- January 16, 2023
యూఏఈ: మొదటి టర్మ్ పరీక్షల ముగింపులో మెరుగైన పనితీరు కనబరచని లేదా ఉత్తీర్ణత గ్రేడ్ను పొందని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా కొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ESE) ప్రకటించింది. మొదటి సెమిస్టర్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులకు రెండవ అవకాశం కల్పించడమే విద్యార్థులకు మద్దతు, సాధికారత కార్యక్రమం లక్ష్యం అని ESE డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహ్మద్ అల్ ఖాసిమ్ అన్నారు. 3వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. మొదటి టర్మ్ పరీక్షలలో మొత్తం 50 శాతం కంటే తక్కువ గ్రేడ్ పొందిన మొదటి, రెండవ సైకిల్స్లోని విద్యార్థులు ప్రోగ్రామ్లో చేరేందుకు అర్హులన్నారు. అలాగే, మూడవ సైకిల్లో మొత్తం 60 శాతం కంటే తక్కువ గ్రేడ్ని పొందిన విద్యార్థులు జనవరి 23న ఫిబ్రవరి 3 వరకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. 9 నుండి 12 తరగతులతో సహా మినిస్టీరియల్ పాఠ్యాంశాలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షల ఫలితాలను ESE జనవరి 9న ప్రకటించింది. 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఫలితాలను జనవరి 10న ప్రకటించగా, 1 నుంచి 4వ తరగతి ఫలితాలను జనవరి 11న ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







