మొదటి టర్మ్ పరీక్షల్లో రాణించని విద్యార్థుల కోసం కొత్త ప్రోగ్రామ్
- January 16, 2023
యూఏఈ: మొదటి టర్మ్ పరీక్షల ముగింపులో మెరుగైన పనితీరు కనబరచని లేదా ఉత్తీర్ణత గ్రేడ్ను పొందని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మద్దతుగా కొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించినట్లు ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ESE) ప్రకటించింది. మొదటి సెమిస్టర్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులకు రెండవ అవకాశం కల్పించడమే విద్యార్థులకు మద్దతు, సాధికారత కార్యక్రమం లక్ష్యం అని ESE డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మహ్మద్ అల్ ఖాసిమ్ అన్నారు. 3వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన వివరించారు. మొదటి టర్మ్ పరీక్షలలో మొత్తం 50 శాతం కంటే తక్కువ గ్రేడ్ పొందిన మొదటి, రెండవ సైకిల్స్లోని విద్యార్థులు ప్రోగ్రామ్లో చేరేందుకు అర్హులన్నారు. అలాగే, మూడవ సైకిల్లో మొత్తం 60 శాతం కంటే తక్కువ గ్రేడ్ని పొందిన విద్యార్థులు జనవరి 23న ఫిబ్రవరి 3 వరకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. 9 నుండి 12 తరగతులతో సహా మినిస్టీరియల్ పాఠ్యాంశాలను అనుసరించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు పరీక్షల ఫలితాలను ESE జనవరి 9న ప్రకటించింది. 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఫలితాలను జనవరి 10న ప్రకటించగా, 1 నుంచి 4వ తరగతి ఫలితాలను జనవరి 11న ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







