కుప్పకూలిన నేపాల్ విమాన బ్లాక్బాక్స్ లభ్యం
- January 16, 2023
నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచి పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇవాళ బ్లాక్బాక్స్ గుర్తించామని కాఠ్మాండూ విమానాశ్రయ అధికారి షేర్ బహదూర్ ఠాకూర్ చెప్పారు.
విమానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్లాక్బాక్స్ ప్రత్యేక ఆల్గారిథం ద్వారా రికార్డు చేస్తుంది. కాగా, నేటి తమ రెగ్యులర్ విమాన సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు యతి విమానయాన సంస్థ పేర్కొంది. కాగా, విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!









