కుప్పకూలిన నేపాల్ విమాన బ్లాక్బాక్స్ లభ్యం
- January 16, 2023
నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచి పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇవాళ బ్లాక్బాక్స్ గుర్తించామని కాఠ్మాండూ విమానాశ్రయ అధికారి షేర్ బహదూర్ ఠాకూర్ చెప్పారు.
విమానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్లాక్బాక్స్ ప్రత్యేక ఆల్గారిథం ద్వారా రికార్డు చేస్తుంది. కాగా, నేటి తమ రెగ్యులర్ విమాన సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు యతి విమానయాన సంస్థ పేర్కొంది. కాగా, విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







