కుప్పకూలిన నేపాల్ విమాన బ్లాక్బాక్స్ లభ్యం
- January 16, 2023
నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచి పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇవాళ బ్లాక్బాక్స్ గుర్తించామని కాఠ్మాండూ విమానాశ్రయ అధికారి షేర్ బహదూర్ ఠాకూర్ చెప్పారు.
విమానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్లాక్బాక్స్ ప్రత్యేక ఆల్గారిథం ద్వారా రికార్డు చేస్తుంది. కాగా, నేటి తమ రెగ్యులర్ విమాన సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు యతి విమానయాన సంస్థ పేర్కొంది. కాగా, విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







