విద్యుత్ లేకుండా 45 డిగ్రీల వేడిలో రెండో రోజు షార్జా
- April 29, 2016
ఈ పరిణామంతో భీతిల్లిన మహిళలు, పిల్లలు వేడి నుండి ఉపశమనం పొందడానికి దుబాయ్ , ఇతర ఎమిరేట్స్ లో ఉన్న బంధువులు స్నేహితుల ఇళ్ళకు పరుగులు తీస్తున్నారు.పారిశ్రామిక ప్రాంతాల్లో నివసిస్తున్నకుటుంబాలు షార్జాలో ఏర్పడిన విధ్యుత్ లేమి కారణంగా ఏదో రకంగా ఇళ్లలోనే కాలం గడుపుతుంటే, మరికొందరిలో నిరాశా తో కూడిన డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి మంగళవారం రోజు ఇదే కొనసాగడంతో వేసవి అంటే ఏమిటో షార్జా ప్రజలకు అనుభవం అయ్యంది. షార్జా పారిశ్రామిక జోన్ మరియు రోలా, బుతీన మరియు అల్ టవూన్ కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. దీంతో చెమటలతో దుస్తులు తదిచిపోతున్నాయి. నిజానికి, అనేకమంది ఉద్యోగులు వారు రాత్రి మొత్తం మేల్కొని ఉన్నారు. విద్యుత్ లేకపోవడంతో నిద్రపోయే అవకాశం వారికి లేదు. ఉదయం వేళకు విద్యుత్ తిరిగి రాలేదు "చిన్న పిల్లలతో పలు కుటుంబాలు దుబాయ్ లో స్నేహితులు మరియు బంధువులు ఇళ్లలో ఆశ్రయం పొందారు నా భర్త భారతదేశం లో ఉన్నారు నేను మా నాలుగు ఏళ్ల కుమార్తె. గత మూడు రోజుల మేము రోలా ఒక స్నేహితుని ఇంట్లో నివసిస్తున్నామని " బిందు సురేష్ అనే ఒక గృహిణి చెప్పారు. కార్మిక శిబిరాలలో పనివారు రోజంతా కష్టపడుతూ, పని ముగిసిన తర్వాత తమ తమ గదులకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. విద్యుత్ లేని కారణంగా వారికి నిద్ర లేదు. " 3 వ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు 3,000 కార్మికులు షార్జా మున్సిపాలిటీ ఇచ్చిన వసతి లో నివసిస్తున్నారు. అధికారులు కేవలం అక్కడకు వచ్చి కార్మికులని ఓదార్చారు ," ఈ విషయాన్ని శిబిరంలో ఒక మున్సిపాలిటీ సిబ్బంది ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







