30వేల మార్కును దాటిన బంగారం ధర

- April 29, 2016 , by Maagulf
30వేల మార్కును దాటిన బంగారం ధర

30వేల మార్కును దాటిన బంగారం ధర ఇటీవల బంగారం వర్తకుల సమ్మె కారణంగా దిగొచ్చిన పసిడి ధర.. మళ్లీ పైపైకి పోతోంది. వరుసగా మూడో రోజు బంగారం ధర పెరగడంతో రెండేళ్ల గరిష్ఠానికి చేరి.. రూ. 30వేల మార్కును దాటేసింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 350 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 30,250కి చేరింది. పెళ్లిళ్ల సీజన్‌తో కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,274.24 డాలర్లుగా ఉంది.బంగారం దారిలోనే వెండి.. వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ. 600 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 41,600కి చేరింది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 17.84 డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com