బీఆర్ఎస్ సభపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్
- January 19, 2023
హైదరాబాద్: కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ మొదటి భారీ బహిరంగ సభ..బుధువారం ఖమ్మం లో భారీ ఎత్తున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరై గులాబీమయం చేసారు. ఈ సభలో కేసీఆర్ బిఆర్ఎస్ ఎజెండా ఏంటో తెలిపాడు. అలాగే బిఆర్ఎస్ పార్టీ కి మద్దతు ఇస్తున్నట్లు పంజాబ్ , కేరళ , ఢిల్లీ ముఖ్యమంత్రులు సభ ముఖంగా తెలిపారు. ఇక ఈ సభ ఫై బిజెపి , కాంగ్రెస్ శ్రేణులు పలు విమర్శలు , కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ సభ ఫై స్పందించారు. ప్రధాని మోడీని రక్షించడానికే కేసీఆర్ కాంగ్రెస్ పై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు నిజంగానే బీజేపీని ఓడించాలనే కోరిక ఉంటే, వెళ్లి గుజరాత్ లో పోటీ చేయొచ్చు కదా అని అన్నారు. బీజేపీ చెర నుంచి దేశాన్ని విడిపిస్తామని చెబుతున్న కేసీఆర్… హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని నిలదీశారు.
సంవత్సరాల తరబడి మోడీ తో కేసీఆర్ అంటకాగారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో అనేక పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మోడీ అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు పరిశ్రమలను తీసుకువచ్చింది కాంగ్రెస్ సర్కారేనని తెలిపారు. అలాగే కేసీఆర్ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేయబోతున్నారని రేవంత్ ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని మండిపడ్డారు. కర్ణాటకలో 25మంది కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల మాట్లాడి వారికి 500కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.
తక్కువ మెజారిటీతో గెలిచే నేతలను లక్ష్యంగా పెట్టుకుని కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారని రేవంత్రెడ్డి ఆరోపించారు.ఈ విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియడంతో వారిని ఏఐసీసీ పిలిచి మాట్లాడిందన్నారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని.. బీఆర్ఎస్ సమావేశానికి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







