నేపాల్ డాక్టర్ సందుక్ రూట్ కు ఇసా అవార్డు
- January 19, 2023
బహ్రెయిన్: అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వాన్ని నయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన నేపాల్ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సందుక్ రూట్.. ప్రతిష్టాత్మకమైన ఇసా అవార్డుకు ఎంపికయ్యారు. ఈసా కల్చరల్ సెంటర్లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసా అవార్డ్ ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ సెక్రటరీ జనరల్ అలీ అబ్దుల్లా ఖలీఫా వెల్లడించారు. మానవాళికి సేవ కోసం పాటుపడిన వారికి 11 కేటగిరీలలో ఇసా అవార్డును అందజేస్తుంది.
డాక్టర్ సందుక్ రూట్ కంటిశుక్లం చికిత్సకు ఒక గొప్ప విధానాన్ని అభివృద్ధి పరచి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు. డాక్టర్ రూట్ తక్కువ-ఆదాయ రోగులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేసారు. దాదాపు 120,000 మంది ప్రజల కంటి చూపును కాపాడగలిగారు. అలాగే, డాక్టర్ రూయిట్ తన స్వగ్రామంలో ఒక కర్మాగారాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం 350,000 కంటే ఎక్కువ లెన్స్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి లెన్స్ను $3 కే పంపిణీ చేస్తున్నారు. సాధారణ లెన్స్ ధర బహిరంగ మార్కెట్లో $100 ఉంది. డాక్టర్ రూట్ తన 30-సంవత్సరాల కెరీర్లో 50,000 కంటి శస్త్రచికిత్సలు చేశారు. భూటాన్, థాయిలాండ్, మయన్మార్, మంగోలియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇథియోపియా, బంగ్లాదేశ్, చైనా, ఇండియా వంటి దేశాలలో ఎంతోమంది వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను, వైద్య క్యాంపులను నిర్వహించారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







