ఖతార్‌లో 97 మంది భారతీయుల మృతి

- April 29, 2016 , by Maagulf
ఖతార్‌లో 97 మంది భారతీయుల మృతి

ఖతార్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 97 మంది భారతీయులు మృతి చెందినట్లు ఇండియన్‌ ఎంబసీ అధికారికంగా వెల్లడించింది. 2015, 2015లో 279 మంది చొప్పున భారతీయులు మృతి చెందారు. ఇంకో వైపు 129 మంది భారతీయులు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తుండగా, 103 మంది డిపోర్టేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఎంబసీ టీమ్‌ జైలుని, అలాగే డిపోర్టేషన్‌ సెంటర్‌నీ సంప్రదించి, వివరాల్ని సేకరించింది. ఎంబసీలోని లేబర్‌ అండ్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెక్షన్‌ ఇప్పటివరకూ 1,482 ఫిర్యాదులను అందుకుంది. వీటిని పరిశీలించిన ఎంబసీ, స్థానిక అథారిటీస్‌ రిక్వెస్ట్‌తో 33 ఎమర్జన్సీ సర్టిఫికెట్స్‌ని మంజూరు చేసింది. అలాగే ఎంబసీ 19 ఎయిర్‌ టికెట్స్‌ని మంజూరు చేయడం జరిగింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com