సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు పున:ప్రారంభం

- January 20, 2023 , by Maagulf
సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు పున:ప్రారంభం

దుబాయ్: సాంకేతిక లోపంతో నిలిచిన దుబాయ్ మెట్రో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.  రెడ్‌లైన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిన సర్వీసులు యథావిధిగా ప్రారంభమయ్యాయని దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఈక్విటీ స్టేషన్, జెబెల్ అలీ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశామని అథారిటీ తెలిపింది. మెట్రో సర్వీసుల పున:ప్రారంభం పై అధికార యంత్రాంగం ట్వీట్ చేసింది  "ఈక్విటీ స్టేషన్, జబల్ అలీ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. మీ సహకారానికి ధన్యవాదాలు." అంటూ అథారిటీ తన ట్వీట్ లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com