అయ్య బాబోయ్.! ఆ హీరోయిన్కి కోపమొచ్చేసింది.!
- January 20, 2023
సహజంగానే సెలబ్రిటీలపై దుష్ప్రచారాలు, గాసిప్స్ తరచుగా వినిపిస్తుంటాం. కొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకుంటారు. కొందరైతే ఘాటుగా స్పందిస్తుంటారు.
అయితే, మన హీరోయిన్కి మాత్రం తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఎక్కడ లేని కోపమొచ్చేసిందండోయ్. ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఏంటా గాసిప్.? ఆ వివరాల్లోకి వెళితే, సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేర్ వీరయ్య’తో పాటూ ఓ చిన్న సినిమా కూడా రిలీజ్ అయిన సంగతి చాలా మందికి గుర్తుండి వుండదు. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా అది. ఆ సినిమాలోని హీరోయిన్ పేరు ప్రియా భవానీ శంకర్.
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి ప్రమోట్ అయిన ముద్దుగుమ్మ ఈ భామ. ఎక్కువ డబ్బులు సంపాదించేయడం కోసమే, సినిమాల్లోకి వచ్చేశావా.? అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడట పాపను. అంతే కోపం కట్టలు తెంచుకుంది ప్రియా పాపకి. అవును నిజమే, డబ్బుల కోసమే సినిమాల్లోకి వచ్చా.. అయితే ఏంటట.! అని దురుసుగా కసురుకుంది. ఇంత చిన్న విషయానికే అంత గుస్సా అయితే ఎలా పాపా.? అంటూ అమ్మడిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొందరు నెటిజనం.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







