ఓటీటీలో ‘ధమాకా’ పరువు పోతోందిగా.!
- January 23, 2023
ఇయర్ ఎండింగ్ గిఫ్ట్గా వచ్చిన మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ సూపర్ డూపర్ హిట్టు కొట్టి, సంవత్సరాంతంలో టాలీవుడ్ బాక్సాఫీస్కి సక్సెస్ గిఫ్ట్ ఇచ్చింది.
‘ధమాకా’తో రవితేజ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘వాల్తేర్ వీరయ్య’ హిట్తో డబుల్ ధమాకా అనిపించుకున్నాడు.
అంతా బాగానే వుంది. కానీ, రీసెంట్గా ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ఓటీటీలో ‘ధమాకా’ చూసిన వారంతా పెదవి విరిచేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు రెండూ మిక్సీలో వేసి వదిలిపెట్టారంటూ తిట్టి పోస్తున్నారు.
మరీ సీన్ టూ సీన్, సాంగ్ టు సాంగ్ అంతలా ఎలా కాపీ కొట్టేశావయ్యా మాస్ రాజా.! కాస్తయినా సిగ్గుండక్కర్లా.! అని దారుణంగా తిట్టేస్తున్నారు. దాంతో, హిట్ అనుకున్న ‘ధమాకా’ పరువు మొత్తం పోయినట్లవుతోందిప్పుడు.
ఇక తదుపరి మాస్ రాజా ‘రావణాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









