12వేల మంది ఉద్యోగుల తొలగింపుపై గూగుల్ సీఈవో వ్యాఖ్యలు
- January 24, 2023
లాస్ ఏంజిల్స్: 12 వేల ఉద్యోగుల తొలగింపును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమర్ధించుకున్నారు. సరైన సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. లేదంటే పరిస్థితి మరింత జఠిలంగా మారే అవకాశం ఉందన్నారు.
గూగుల్ సంస్థ సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దానిపై సోమవారం ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. కంపెనీ ప్రగతి మందగించిందని, అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కంపెనీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత ఆరు శాతం ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అప్పుడు సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









