12వేల మంది ఉద్యోగుల తొలగింపుపై గూగుల్ సీఈవో వ్యాఖ్యలు
- January 24, 2023
లాస్ ఏంజిల్స్: 12 వేల ఉద్యోగుల తొలగింపును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమర్ధించుకున్నారు. సరైన సమయంలోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. లేదంటే పరిస్థితి మరింత జఠిలంగా మారే అవకాశం ఉందన్నారు.
గూగుల్ సంస్థ సుమారు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దానిపై సోమవారం ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడారు. కంపెనీ ప్రగతి మందగించిందని, అందుకే సరైన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కంపెనీ అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కంపెనీ వ్యవస్థాపకులు, బోర్డు సభ్యులతో చర్చించిన తర్వాత ఆరు శాతం ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా స్పష్టంగా, చాలా నిర్ణయాత్మకంగా, చాలా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరిగితే అప్పుడు సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







