భారత ప్రవాసులకు శుభవార్త..దుబాయ్, షార్జాలో 7 రోజులపాటు పాస్పోర్ట్,వీసా సేవలు
- January 27, 2023
యూఏఈ: భారతీయ ప్రవాసులు ఇప్పుడు ఆదివారంతో సహా అన్ని రోజులలో పాస్పోర్ట్, వీసా సేవల కోసం తమ దరఖాస్తును సమర్పించవచ్చు. ఇండియన్ ఔట్సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్, BLS ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ కేంద్రాలు, పాస్పోర్ట్, వీసా సంబంధిత సేవల కోసం దరఖాస్తును సమర్పించడానికి ఆదివారంతో సహా వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి. భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి ఈ విషయాన్ని తెలిపారు. భారతీయ పౌరుడు అపాయింట్మెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ఏదైనా విషయానికి సంబంధించి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి కాన్సులేట్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. భారతీయ ప్రవాసుల నుండి డిమాండ్ , అభ్యర్థనల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు మినహా జనవరి 22 నుండి అన్ని రోజులలో పాస్పోర్ట్, వీసా సేవల కోసం దరఖాస్తు సమర్పించడానికి దుబాయ్, షార్జాలో మూడు కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారాల్లో దరఖాస్తుదారులు తత్కాల్ కేసులు, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం) మినహా అపాయింట్మెంట్ ప్రాతిపదికన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో పూరించిన దరఖాస్తును అవసరమైన సహాయక పత్రాలతో పాటు సమర్పించవచ్చు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







