శంకర్ సునీల్ ల కాంబినేషన్ లో కొత్త చిత్రం.!
- April 30, 2016
వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.శంకర్ 'జై బోలో తెలంగాణ' చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల నూతన తారలతో దర్శకునిగా తన తొమ్మిదో చిత్రాన్ని ప్రారంభించిన ఎన్.శంకర్ ఇప్పుడు సునీల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారిగా తన బ్యానర్లో వేరే దర్శకునికి అవకాశం ఇచ్చారు. 'దూకుడు', 'బాద్షా', 'ఆగడు' చిత్రాలకు స్టోరీ డిపార్ట్మెంట్లో పని చేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







