'తొలి కిరణం' పాటల చిత్రీకరణకు ఈజిప్టుకు...
- April 30, 2016
సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో జె.జాన్ బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్న సినిమా 'తొలి కిరణం'. మూడు పాటల మినహా చిత్రీకరణ పూర్తి చేసు కొంది. ఈ సందర్భంగా దర్శకుడు జె.జాన్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలనుసహజ సిద్ధంగా చిత్రీకరించేందుకు జెరుసలేం, ఈజిప్టు దేశాలకు వెళ్ళనున్నాం. ఇప్పటి వరకు వచ్చిన జీసస్ చిత్రాలలో ఎవరూ.. స్మృశిం చని కోణాలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలియబరచబోతున్నాం. ఈ చిత్రానికి క్రైస్తవ సమాజం నుంచే కాక, ఇతర వర్గాల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్.పి.పట్నాయక్ సంగీతాన్ని ఇచ్చారు. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చింది. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించ డానికి ఈజిప్టు వెళ్ళబోతున్నాం. ఆర్.పి గారు అందించిన మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుం టుంది'' అని చెప్పారు.ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. కళలకు మతం లేదు. సినిమాకు కూడా మతం లేదు. ఇదొక మనిషి సినిమా. జీసస్ జీవితంలో జరిగిన నలభై రోజుల అధ్బుత ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమా ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే పాట లను చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు మ్యూజిక్ చేశాను'' అని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







