లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
- February 02, 2023
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు 7వ రోజుకు చేరింది. 7 రోజు వైస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండానే వాహానాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మరోవైపు నారా లోకేష్ యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాదయాత్రలో భాగంగా న్యాయవాదులు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్కు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఫ్లైఓవర్ మీదుగా అభిమానులు పూల వర్షం కురిపించారు. పార్టీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. చరణ్ డాభా ప్రాంతంలో లోకేష్ న ఎంఎస్ఎంఈ యూనియన్ ప్రతినిధులు కలిశారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!