లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
- February 02, 2023
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు 7వ రోజుకు చేరింది. 7 రోజు వైస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండానే వాహానాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మరోవైపు నారా లోకేష్ యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాదయాత్రలో భాగంగా న్యాయవాదులు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్కు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఫ్లైఓవర్ మీదుగా అభిమానులు పూల వర్షం కురిపించారు. పార్టీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. చరణ్ డాభా ప్రాంతంలో లోకేష్ న ఎంఎస్ఎంఈ యూనియన్ ప్రతినిధులు కలిశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







