లోకేష్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
- February 02, 2023
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు 7వ రోజుకు చేరింది. 7 రోజు వైస్సార్సీపీ మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పలమనేరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతులు లేకుండానే వాహానాన్ని తీసుకొచ్చారని పోలీసులు ఆరోపించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మరోవైపు నారా లోకేష్ యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాదయాత్రలో భాగంగా న్యాయవాదులు, ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్కు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. ఫ్లైఓవర్ మీదుగా అభిమానులు పూల వర్షం కురిపించారు. పార్టీ సీనియర్ నాయకుల ఆశీర్వాదం తీసుకున్న నారా లోకేష్, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. చరణ్ డాభా ప్రాంతంలో లోకేష్ న ఎంఎస్ఎంఈ యూనియన్ ప్రతినిధులు కలిశారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







