హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకున్న E-రేసింగ్ కార్లు
- February 02, 2023
హైదరాబాద్: ఫార్ములా E ఛాంపియన్షిప్ హైదరాబాద్కు వచ్చింది! దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ను నిర్వహించడంలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) బృందం కీలక పాత్ర పోషించింది.విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. నిన్న రాత్రి (ఫిబ్రవరి 1) 11.50 గంటలకు రియాద్ నుండి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు హైదరాబాద్ కార్గో టెర్మినల్కు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి గ్లోబల్ మోటార్స్పోర్ట్, ఫార్ములా-E వరల్డ్ ఛాంపియన్షిప్లో 11 జట్లు పోటీ పడుతున్నాయి, నగరంలో ఇంతకు ముందెన్నడూ చూడని ఆల్-ఎలక్ట్రిక్ అద్భుతమైన మోటో కార్లతో ఉత్సాహాన్ని నింపుతాయి.
ఆటో విడిభాగాలకు చెందిన 83 బాక్స్లతో కూడిన కార్గో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్లాట్ల వద్ద నిలిపిన విమానం నుండి ఆఫ్లోడ్ చేసారు. వాటిని అన్ లోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి, GHAC టెర్మినల్లోని ప్రత్యేకమైన హ్యాండ్లింగ్ ప్రాంతానికి తరలించారు. రేసింగ్ కార్ల కార్గో బదిలీ కోసం ఆప్రాన్ నుండి ల్యాండ్సైడ్ వరకు ఒక ప్రత్యేకమైన గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసారు. వివిధ టచ్ పాయింట్లలో వేగవంతమైన ఆన్సైట్ కస్టమ్ క్లియరెన్స్ తో విడి భాగాలకు వేగంగా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. E-ఫార్ములా బృందానికి సహాయం చేయడానికి, షిప్మెంట్ ప్రక్రియ సమర్థవంతమైన నిర్వహణ కోసం హైదరాబాద్ కార్గో వారు ఒక మల్టీ-స్టేక్హోల్డర్ క్రాక్ టీమ్ ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా GHIAL CEO ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, “దేశంలో మొట్టమొదటి ఫార్ములా E ఛాంపియన్షిప్ కోసం నిరాటంకమైన ఎయిర్ కార్గో సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం పాత్ర పోషించడం గర్వంగా ఉంది. దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన కార్గో హబ్గా, హైదరాబాద్ టెంపరేచర్-సెన్సిటివ్ వస్తువులు, భారీ యంత్రాలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, పశువులు, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో సురక్షితంగా రవాణా చేయబడే అనేక ఇతర వస్తువుల రవాణాను నిర్వహిస్తోంది. ఈ కన్సైన్మెంట్ నిర్వహణ ఆటో సెక్టార్ అవసరాలను తీర్చే మా సామర్థ్యాలను తెలియజేస్తుంది. మా కార్గో సౌకర్యాల మరింత విస్తరించి, డిజిటలైజేషన్తో మేము వినియోగదారులకు మా సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాము.’’ అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







