మొబైల్ ఫోన్కు మంటలు.. సౌదీ యువతికి గాయాలు
- February 04, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలోని నార్తర్న్ బోర్డర్ రీజియన్లో మొబైల్ ఫోన్ చార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగి 13 ఏళ్ల బాలికకు కాలిన గాయాలు అయ్యాయి. రాఫా గవర్నరేట్లో బాలిక మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి ఫోన్ ని చేతిలో పట్టుకుని నిద్రపోయింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ కాలిపోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే యువతిని రఫా సెంట్రల్ హాస్పిటల్లోని అత్యవసర గదికి తీసుకెళ్లారు. తన కుమార్తె తన మొబైల్ ఫోన్ను ఛార్జర్కు కనెక్ట్ చేసి పడుకుందని, అది పేలి మంటలు చెలరేగాయని తండ్రి వెల్లడించాడు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







