మొబైల్ ఫోన్కు మంటలు.. సౌదీ యువతికి గాయాలు
- February 04, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలోని నార్తర్న్ బోర్డర్ రీజియన్లో మొబైల్ ఫోన్ చార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగి 13 ఏళ్ల బాలికకు కాలిన గాయాలు అయ్యాయి. రాఫా గవర్నరేట్లో బాలిక మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి ఫోన్ ని చేతిలో పట్టుకుని నిద్రపోయింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ కాలిపోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే యువతిని రఫా సెంట్రల్ హాస్పిటల్లోని అత్యవసర గదికి తీసుకెళ్లారు. తన కుమార్తె తన మొబైల్ ఫోన్ను ఛార్జర్కు కనెక్ట్ చేసి పడుకుందని, అది పేలి మంటలు చెలరేగాయని తండ్రి వెల్లడించాడు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







