మొబైల్ ఫోన్కు మంటలు.. సౌదీ యువతికి గాయాలు
- February 04, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలోని నార్తర్న్ బోర్డర్ రీజియన్లో మొబైల్ ఫోన్ చార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగి 13 ఏళ్ల బాలికకు కాలిన గాయాలు అయ్యాయి. రాఫా గవర్నరేట్లో బాలిక మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి ఫోన్ ని చేతిలో పట్టుకుని నిద్రపోయింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ కాలిపోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే యువతిని రఫా సెంట్రల్ హాస్పిటల్లోని అత్యవసర గదికి తీసుకెళ్లారు. తన కుమార్తె తన మొబైల్ ఫోన్ను ఛార్జర్కు కనెక్ట్ చేసి పడుకుందని, అది పేలి మంటలు చెలరేగాయని తండ్రి వెల్లడించాడు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







