మొబైల్ ఫోన్కు మంటలు.. సౌదీ యువతికి గాయాలు
- February 04, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలోని నార్తర్న్ బోర్డర్ రీజియన్లో మొబైల్ ఫోన్ చార్జింగ్ అవుతుండగా మంటలు చెలరేగి 13 ఏళ్ల బాలికకు కాలిన గాయాలు అయ్యాయి. రాఫా గవర్నరేట్లో బాలిక మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి ఫోన్ ని చేతిలో పట్టుకుని నిద్రపోయింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ కాలిపోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే యువతిని రఫా సెంట్రల్ హాస్పిటల్లోని అత్యవసర గదికి తీసుకెళ్లారు. తన కుమార్తె తన మొబైల్ ఫోన్ను ఛార్జర్కు కనెక్ట్ చేసి పడుకుందని, అది పేలి మంటలు చెలరేగాయని తండ్రి వెల్లడించాడు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









